చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం..

by  |
చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం..
X

దిశ, మునుగోడు : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఈరోజు ఉదయం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి నడుచుకుంటూ వస్తూ ఆకస్మాత్తుగా కిందపడిపోయి.. ఓ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అయితే చనిపోయిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చౌటుప్పల్ సీఐ ఎన్. శ్రీనివాస్ వెల్లడించారు.

ఆ వ్యక్తి మృతి చెందడానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. కరోనా పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరిస్థితి విషమించడం వలనే ఆ వ్యక్తి మృతి చెంది ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. చనిపోయిన వ్యక్తికి కరోనా పరీక్షలు కూడా నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు.



Next Story

Most Viewed