ప్రమాదవశాత్తు చెరువులో మునిగి వ్యక్తి మృతి

by Batti.Sumithra |

<p>దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని కంది మండలం చిమ్నాపూర్ కు చెందిన ఓ వ్యక్తి బర్రెలను కడగడానికి చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గ్రామానికి చెందిన చీకుర్తి లక్ష్మయ్య (60) రోజు మాదిరిగానే గురువారం నాడు బర్రెలు మేపుతూ చిమ్నాపూర్ చెరువు వద్దకు వెళ్ళాడు. చెరువులోకి దిగిన బర్రెలను కడిగేందుకు లక్ష్మయ్య చెరువులో దిగి ప్రమాదావశాత్తు చెరువులో మునిగి చనిపోయాడు. లక్ష్మయ్య ఇంటికి రాకపోవడంతో అతని బంధువులు, గ్రామస్తులు చెరువులో వెతకగా శుక్రవారం [&hellip;]</p>

ప్రమాదవశాత్తు చెరువులో మునిగి వ్యక్తి మృతి
X

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని కంది మండలం చిమ్నాపూర్ కు చెందిన ఓ వ్యక్తి బర్రెలను కడగడానికి చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గ్రామానికి చెందిన చీకుర్తి లక్ష్మయ్య (60) రోజు మాదిరిగానే గురువారం నాడు బర్రెలు మేపుతూ చిమ్నాపూర్ చెరువు వద్దకు వెళ్ళాడు.

చెరువులోకి దిగిన బర్రెలను కడిగేందుకు లక్ష్మయ్య చెరువులో దిగి ప్రమాదావశాత్తు చెరువులో మునిగి చనిపోయాడు. లక్ష్మయ్య ఇంటికి రాకపోవడంతో అతని బంధువులు, గ్రామస్తులు చెరువులో వెతకగా శుక్రవారం ఉదయం లక్ష్మయ్య మృతదేహం చెరువులో తేలియాడుతూ కనిపించింది. మృతుడు లక్ష్మయ్య భార్య వినోద ఫిర్యాదు మేరకు కంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story