- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నేరేడుచర్ల : కరోనా వ్యాధి నుంచి బయటపడిన వారిని బ్లాక్ ఫంగస్ కలవర పెడుతుంది. తాజాగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని కల్మెల చెర్వు గ్రామానికి చెందిన వ్యక్తిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడ్డాయి. అయితే అతడికి ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అతను హోంఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందాడు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత అతనికి కళ్ళు ఎర్రబడటం, కంటిచూపు తగ్గినట్లుగా అనిపించడంతో మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు వచ్చిన ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. మండలంలో మొట్టమొదటిసారిగా ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ బారిన పడి మరణించడంతో మండలంలోని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.
Next Story