ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి

by  |
ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి
X

దిశ, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఓ ప్రయాణికుడు ఆకస్మికంగా మృతి చెందాడు. ఈ ఘటన షాద్‌‌నగర్ లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. షాద్‌నగర్ డిపో బస్సు.. మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్‌కు వెళుతుంది. జడ్చర్ల బస్టాండ్‌లో మిరియాల సింగోటం అనే వ్యక్తి బస్సు ఎక్కాడు. అయితే బస్సు షాద్‌నగర్ కు వచ్చేసరికి మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. మృతుని వద్ద ఉన్న ఫోన్ ద్వారా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

Next Story

Most Viewed