- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ, మెదక్: అతని వయస్సు 28 ఏళ్లు. అతనికి భార్య, కూతురు కూడా ఉంది. సంసారం ఆనందంగా సాగిపోతున్న వేళ.. అతన్ని దురదృష్టం వెంటాడింది. ఇంతకీ అతనికి ఏమైందో తెలుసుకుందాం. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన ఉడుత ఎల్లయ్య, పోచవ్వ దంపతులకు రాజు(28) అనే కుమారుడు ఉన్నాడు. లాక్ నేపథ్యంలో పనులేమీ లేకపోవడంతో బుధవారం సాయంత్రం స్నేహితులతో కలసి సమీపంలోని కాల్వకు ఈతకెళ్లాడు. ఈ క్రమంలో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం తిరిగి గాలింపు చర్యలు చేపట్టగా రాజు శవమై తేలాడు. మృతుడికి భార్య లావణ్య, కూతురు శివన్షిక ఉన్నారు. రాజు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story