ఆయాసపడుతూ.. రోడ్డు మీదే కుప్పకూలాడు

by  |
ఆయాసపడుతూ.. రోడ్డు మీదే కుప్పకూలాడు
X

దిశ, మిర్యాలగూడ: పట్టణంలో డాక్టర్స్ కాలనీలో గురువారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆయాసపడుతూ రోడ్డు మీదే కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు అతన్ని ఆటోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతిచెందిన వ్యక్తికి సంబంధించి ఎవరూ రాకపోవడంతో డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చనిపోయిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు.


Next Story

Most Viewed