జగన్ పాలనకు వైఎస్ పాలనకు పోలికే లేదు:వైఎస్ షర్మిల

by Disha Web Desk 18 |
జగన్ పాలనకు వైఎస్ పాలనకు పోలికే లేదు:వైఎస్ షర్మిల
X

దిశ,వెబ్‌డెస్క్: సీఎం జగన్ పాలనకు, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనకు అసలు పోలికే లేదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల మాట్లాడుతూ సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉండేవారని చెప్పారు. కానీ జగన్ మాత్రం ఎప్పుడూ ప్రజలతో మమేకం కాలేదు. జగన్ పాలనలో మంత్రులకే అపాయింట్‌మెంట్ దొరకదు అని విమర్శించారు. మద్య నిషేధం అని చెప్పి ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది. ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్స్ ఇక్కడే ఉన్నాయి. నాసిరకం మద్యం తాగి ప్రజలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలోనే పులి కడుపున పులే పుడుతుంది.. నాది వైఎస్‌ఆర్‌ రక్తం. ఎవరు అవునన్నా.. కాదన్నా నేను వైఎస్‌ షర్మిలా రెడ్డినే” అని ఆమె వ్యాఖ్యానించారు.

Read More...

AP:పొన్నవోలుకు ఏఏజీ పదవి ఎందుకిచ్చారు?..షర్మిల సెన్సేషనల్ కామెంట్స్!



Next Story