మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

by  |
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో విషాదం నెలకొంది. హనుమకొండ సంజీవులు అనే వ్యక్తి జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడు. సంజీవులు రెండు సంవత్సరాల క్రితం తన భార్య, ముగ్గురు కూతుర్లతో కలిసి జీవనోపాధి కోసం.. పటాన్‌చెరు వలస వచ్చి చైతన్య నగర్ కాలనీలో కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, అతడు గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పి, పక్షవాతం వ్యాధితో బాధపడుతున్నాడు. చాలా చోట్ల నాటువైద్యం చేయించుకున్నప్పటికీ వ్యాధి తగ్గలేదు. దీంతో విరక్తి చెందిన సంజీవులు.. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Next Story