భార్య అలా చేసింది.. వారిని వదిలి ఉండలేని భర్త చెట్టు ఎక్కి..

by  |
భార్య అలా చేసింది.. వారిని వదిలి ఉండలేని భర్త  చెట్టు ఎక్కి..
X

దిశ‌, మంగ‌పేట: ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకొంది. బిడ్డలు దూరమవుతున్నారని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలలోకి వెళితే.. మంగపేట మండలం కమలాపూర్ లోని ఎస్సీ కాలనీలో పున్నారావు అనే వ్యక్తి భార్య, పిల్లలతో నివసిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా పున్నారావుకు, భార్యకు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భార్య, పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో పిల్ల‌ల‌కు దూర‌మ‌వుతున్నాన‌నే మ‌న‌స్తాపంతో పున్నారావు గురువారం ఉద‌యం గ్రామంలోని చెట్టు ఎక్కి ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లాన్ని సంద‌ర్శించి వివ‌రాలు సేక‌రిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed