మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి.. షాకైన స్థానికులు

by  |
మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి.. షాకైన స్థానికులు
X

దిశ, మహబూబాబాద్ : మద్యం మత్తులో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పరాజుపల్లి గ్రామానికి చెందిన మల్లబోయిన శ్రీరాములు(45) అప్పుడప్పుడు విపరీతంగా మద్యం సేవిస్తూ ఉంటాడు.

ఈ క్రమంలోనే మద్యం మత్తులో గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న గూడూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed