మద్యానికి డబ్బులివ్వలేదని పురుగుల మందు తాగేశాడు

by  |
మద్యానికి డబ్బులివ్వలేదని పురుగుల మందు తాగేశాడు
X

దిశ, కోటగిరి: మద్యానికి బానిసైన వ్యక్తి జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన కోటగిరి మండలం సొంపుర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం.. సొంపుర్ గ్రామానికి చెందిన చాతురే లింబాద్రి అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. ఎలాంటి పని చేయకుండా తరుచూ భార్య పిల్లలతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం రోజున మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదన్న మనస్తాపంతో పురుగుల మందు తాగేశాడు. ఇది గమనించిన కుటుంబీకులు 108లో బోధన్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించిందని.. మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున లింబాద్రి చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై వివరణ ఇచ్చారు.


Next Story

Most Viewed