- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, స్టేషన్ ఘన్ పూర్: వరంగల్ లో దారుణ హత్య జరిగింది. రేషన్ బియ్యం కోసం వెళుతున్న చింత అశోక్(35) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేసి పరారైన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. వివరాలలోకి వెళితే వరంగల్ అర్బన్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన చింత అశోక్ సోమవారం రేషన్ బియ్యం తెచ్చేందుకు రేషన్ షాప్ కి బయల్దేరాడు. మార్గమధ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు అశోక్ పై దాడికి పాల్పడ్డారు. గొడ్డలి, కర్రలతో విచక్షణ రహితంగా దాడిచేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 6 నెలల కిందట ఓ పెళ్లి బారత్ లో జరిగిన గొడవలు ఈ హత్యకు కారణమై ఉండవచ్చునని స్థానికులు భావిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.