పెళ్లైన ఆరునెలలకే ఇంత దారుణమా.. పాపం రాగిణి

by  |
warangal news
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : ఎంతో ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకున్న ఇద్ద‌రి మ‌ధ్య అనుమానం చిచ్చు రేపింది. మ‌న‌స్ప‌ర్థల‌తో ప్రాణాలు తీసుకునే వ‌ర‌కు వెళ్ళింది. క్ష‌ణికావేశంలో భార్య‌ను చంపి.. ఆ త‌ర్వాత తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్న దారుణ సంఘ‌ట‌న వరంగల్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే భూపాలపల్లి పట్టణంలోని లక్ష్మీనగర్‌కు చెందిన సిరిపురం హరిశంకర్‌కు, మల్హర్‌ మండలం రుద్రారం గ్రామానికి చెందిన బైరి రాగిణి (24)కి ఆరు నెలల క్రితం పెళ్లి జ‌రిగింది. హరిశంకర్‌ వైశ్య సామాజిక వర్గానికి చెందిన వాడు కాగా రాగిని పద్మశాలి. ఇద్ద‌రు ఇష్ట‌ప‌డి పెద్ద‌ల స‌మ‌క్షంలోనే వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులు ఎంతో అన్యోన్యంగా సాగిన వారి వివాహ బంధంలోకి ముందు వ‌ర‌క‌ట్న భూతం ప్ర‌వేశించింది. హరిశంకర్ వ‌ర‌క‌ట్నం లేకుండా చేసుకున్నానంటూ త‌రుచూ అన‌డంతో రాగిణి మ‌న‌స్తాపం చెందింది.

రాగిణి వివాహేత‌ర సంబంధం కూడా క‌లిగి ఉంద‌నే హ‌రిశంక‌ర్‌ అనుమానం పెంచుకున్నాడు. ఇదే విష‌య‌మై గొడ‌వ‌లు జ‌ర‌గ‌డంతో విష‌యం పంచాయ‌తీ వ‌ర‌కు వెళ్లింది. పంచాయితీలో దంప‌తుల‌కు స‌ర్ది చెప్పిన పెద్ద‌లు కాపురం చేసుకోవాల‌ని హ‌రిశంక‌ర్‌తో పంపించారు. అయినా హరిశంకర్ లో మార్పు రాలేదు. ఈ విషయమై బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే కోపోద్రిక్తుడైన హ‌రిశంక‌ర్ క్ష‌ణికావేశంలో రాగిణి గొంతు కోసి హతమార్చాడు. అనంతరం ఇంటికి తాళం వేసి ప‌రార‌య్యాడు. గురువారం మ‌ధ్యాహ్నం అదే ఇంట్లో కింది అంత‌స్తులో ఉంటున్న పొరుగు వారు గ‌మ‌నించి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హరిశంకర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

రైలు కింద ప‌డి..

రాగిణిని హ‌త్య చేసిన హ‌రిశంక‌ర్ గురువారమే వ‌రంగ‌ల్ చేరుకున్నాడు. క్ష‌ణికావేశంలో భార్య‌ను హ‌త్య చేసి తీవ్ర మ‌న‌స్థాపంతో రైలు కిందప‌డి మృతి చెందాడు. శుక్ర‌వారం రైల్వే సిబ్బంది గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed