కూకట్‌పల్లిలో విస్తృత తనిఖీలు.. గంజాయి విక్రయిస్తోన్న వ్యక్తి అరెస్ట్

by  |
Excise police
X

దిశ, కూకట్‌పల్లి: కూకట్‌పల్లి సర్కిల్‌లోని ఎల్లమ్మబండలో గంజాయి విక్రయిస్తోన్న ఓ వ్యక్తిని బుధవారం బాలానగర్​ఎక్సైజ్​పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జీవన్ కుమార్ వివరాల ప్రకారం.. ఎల్లమ్మబండ సిక్కు కాలనీలో నివాసం ఉంటున్న టాంక్ జగత్​సింగ్(37) గంజాయి విక్రయిస్తున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్​పోలీసులు బుధవారం అతని ఇంటిపై దాడులు జరిపారు. ఈ సదర్భంగా 2.1 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జగత్‌ను అదుపులో తీసుకొని విచారించగా నాందేడ్​నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు నేరం అంగీకరించాడు. దీంతో నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు జీవన్ కుమాన్ తెలిపారు. దాడిలో ఎక్సైజ్ ఎస్ఐలు జశ్వంత్, మహేందర్, సిబ్బంది శ్రీనివాస్, బాలరాజు, రాంచందర్, సురేందర్, పద్మ, భార్గవి, శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed