నలుగురిని హత్య చేశాడని.. అరెస్ట్ చేయబోతే సీఐని కూడా చంపేశాడు

by  |
CI-killed-by-man
X

దిశ, వెబ్ డెస్క్: నలుగురిని హత్య చేశాడని అరెస్ట్ చేయబోతే సీఐని కూడా చంపేసిన వ్యక్తిని త్రిపుర పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం… త్రిపుర రాష్ట్రంలోని ష్యురాటలీ గ్రామంలో ప్రదీప్ అనే వ్యక్తి సడెన్ గా అదోలా ప్రవర్తించి తన భార్య, సోదరుడు, ఇద్దరు కూతుర్లు.. మొత్తం నలుగురిపై శనివారం ఉదయం ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. ఇద్దరు కూతుర్లు, సోదరుడు అక్కడికక్కడే మృతిచెందారు. ఆ తర్వాత ఓ ఆటో డ్రైవర్, ఆ ఆటో డ్రైవర్ కుమారుడిపై కూడా ఇనుప రాడ్ తో ప్రదీప్ దాడి చేశాడు. దీంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రదీప్ దాడిలో మొత్తం నలుగురు మృతిచెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న వెంటనే సీఐ సత్యజిత్ పోలీస్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించాడు. అనంతరం ప్రదీప్ ను నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో సీఐపై కూడా ప్రదీప్ దాడి చేశాడు. దీంతో సీఐ సత్యజిత్ అక్కడికక్కడే మృతిచెందాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story

Most Viewed