ముస్లింల పవిత్ర గ్రంథాలను తగులబెట్టిన వ్యక్తి అరెస్ట్

by  |
Arrest-of-Person1
X

దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని చింతల్ బోరీ గ్రామంలో శుక్రవారం మసీదులోకి ఓ వ్యక్తి చొరబడి ముస్లింల పవిత్ర గ్రంథాలను కాలబెట్టాడు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి 24 గంటలలో నిందితుడిని గుర్తించారు. ఘటనపై భైంసా పట్టణ అదనపు ఎస్పీ కిరణ్ కారే మాట్లాడుతూ… ఘటనకు సంబంధించిన నిందితుడు అదే గ్రామానికి చెందిన షేక్ అమీన్ (60) గా గుర్తించామని, నేరాన్ని తానే స్వయంగా ఒప్పుకున్నాడని, నిందితునిపై కేసు నమోదు చేశామని తెలిపారు. శాంతికి భంగం కలిగించే ఘటనలపై ఎలాంటి పుకార్లు చేయరాదని, అలా చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


Next Story