ఆ విషయంలో పీఎం సహాయపడాలి: మమతా బెనర్జీ

by  |
ఆ విషయంలో పీఎం సహాయపడాలి: మమతా బెనర్జీ
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రజలందరికీ టీకా వేస్తామని, అందుకోసం ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు సూచిస్తే తమ ప్రభుత్వం టీకాలను సమకూర్చుకుంటుందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధానికి మమతా బెనర్జీ లేఖ రాశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ టీకా అందించాలి అనుకుంటున్నామని, తద్వారా పోలింగ్ సురక్షితంగా జరుగుతుందని వివరించారు. తొలుత హెల్త్‌కేర్ వర్కర్లకు, తర్వాత ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా వేస్తున్నామని, ఈ తరుణంలో ఎన్నికల్లో పాల్గొనే అధికారులందరికీ వ్యాక్సిన్ వేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రప్రజలందరికీ ఉచితంగా టీకా పంపిణీ చేయాలని యోచిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.


Next Story

Most Viewed