- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఇరవై ఏళ్లపాటు సూర్యాపేటకు ఎమ్మెల్యేగా పనిచేసిన వామపక్ష నేత ఉప్పల మల్సూర్ ఇల్లు ఇది. 1952 నుంచి 1972 మధ్యకాలంలో ఐదుసార్లు సీపీఐ(ఎం) పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు.1999లో తుదిశ్వాస విడిచేవరకూ ఈ ఇంట్లోనే ఉన్నారు.ఆయన సతీమణి లచ్చమ్మ నాలుగేళ్ల కిందట కన్నుమూశారు. సూర్యాపేటలోని మోతె మండలం సిరికొండలో ఉన్న ఈ ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం మల్సూర్ కుమారుడు, కోడలు ఇందులో ఉంటున్నారు. మల్సూర్ జీవించి ఉండగా తన ఐదొందల గజాల స్థలాన్ని పాఠశాలకు ఇస్తానని మాట ఇచ్చారట. ఆ హామీని ఆయన కుమారులు నెరవేర్చారు. మల్సూర్ కూడబెట్టిందేమీ లేకపోవడంతో.. ప్రస్తుతం వారు కూలీలుగా కాలం వెళ్లదీస్తున్నారు. కూలిపోతున్న ఇల్లు స్థానంలో కొత్తదాన్ని నిర్మించుకునేందుకు సాయం కోసం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు.
Next Story