- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, అబ్దుల్లాపూర్మెట్: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత రొక్కం భీంరెడ్డి, కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి మల్రెడ్డి రంగారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉందన్న అక్కసుతో తుర్కయంజాల్ మున్సిపాలిటీ అభివృద్ధిని కిషన్రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీని అభివృద్ధి చేయనీయడం లేదని, కిషన్రెడ్డికి చేతనైతే ఎమ్మెల్యే నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని, లేదంటే చేతులు ముడుచుకొని కూర్చోవాలన్నారు. ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తీరును నిరసిస్తూ అవసరమైతే సీఎం ఆఫీసు ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు జరగక కౌన్సిలర్లు వార్డుల్లో తిరగలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజాపూర్లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కాసులకు కక్కుర్తిపడి నాలాపై నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ మల్ రెడ్డి అనురాధ రంగారెడ్డి, వైస్ చైర్ పర్సన్ గుండ్లపల్లి హరిత ధనరాజ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.