సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. వాయిదాపడ్డ ‘జగ్ జగ్ జీయో’

by  |
సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. వాయిదాపడ్డ ‘జగ్ జగ్ జీయో’
X

దిశ, సినిమా : దేశవ్యాప్తంగా కొవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతంగా కొనసాగుతుండగా.. ఈ ఎఫెక్ట్‌ సినీ పరిశ్రమపైనా పడింది. నైట్ కర్ఫ్యూలు, ఇతర ఆంక్షల వల్ల ఫిల్మ్ మేకర్ల ప్లానింగ్స్ ఏవీ వర్కవుట్ కావడం లేదు. ఈ క్రమంలో తమ ప్రాజెక్టుల విడుదల తేదీలు, షూటింగ్స్‌ను వాయిదా వేసుకుంటున్నారు. ఈ మేరకు ‘జగ్ జగ్ జీయో’ సెకండ్ షెడ్యూల్ వాయిదా వేస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించారు. రాజ్ మెహతా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, ఇప్పటికే 60 % చిత్రీకరణ పూర్తయింది.

ప్రస్తుతం ముంబైలోనే రెండో షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేయగా, మహారాష్ట్రలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూతో పాటు పలు ఆంక్షలు విధించింది. దీంతో తమ సినిమా షూటింగ్ సాధ్యపడదని భావించి కొద్దిరోజుల పాటు వాయిదా వేసినట్లు డైరెక్టర్ రాజ్ మెహతా పేర్కొన్నారు.



Next Story