జాతీయ లోక్ అదాలత్ ని విజయవంతం చేయండి : న్యాయమూర్తి రవి

by  |
జాతీయ లోక్ అదాలత్ ని విజయవంతం చేయండి : న్యాయమూర్తి రవి
X

దిశ, సిర్పూర్ : వచ్చే నెల 11న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని న్యాయమూర్తి రవి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కోర్టు భవనంలో న్యాయమూర్తి, న్యాయవాదులతో లోక్ అదాలత్‌కు సంబంధించిన విషయాలపై సమీక్ష సమావేశం చేపట్టారు. కేసులోని కక్షిదారు‌లను సమన్వయపరిచి జాతీయ లోక్ అదాలత్‌లో వారి కేసులను పరిష్కరించుకునేలా అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ మొత్తం కేసులు రాజీ పడే విధంగా ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిషోర్ కుమార్, న్యాయవాదులు ఆర్య అహ్మద్, గణపతి, శ్రీనివాస్, గంట కళ్యాణ్, అజయ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story