- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన ప్రీమియం ఎస్యూవీ మోడల్ ఎక్స్యూవీ700 బుకింగ్లను అక్టోబర్ 7 నుంచి ప్రారంభిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. అందుబాటు ధరలో అత్యాధునిక ఫీచర్లతో ఈ ఎస్యూవీ వాహనం వినియోగదారులకు లభించనుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు కోరుకునే మెరుగైన వేరియంట్లు, సౌకర్యవంతమైన సిటింగ్ సామర్థ్యం, ఆకట్టుకునే డ్రైవింగ్ అనుభూతి, ట్రాన్స్మిషన్ సిస్టమ్ను ఈ కారు మోడల్లో అందిస్తున్నామని కంపెనీ వివరించింది.
మాన్యువల్, ఆటోమెటిక్ ఆప్షన్లతో 5,7 సీట్ల సామర్థ్యం ఇందులో ఉంది. ప్రస్తుతం మహీంద్రా ఎక్స్యూవీ పెట్రోల్ ఇంజిన్ బేసి వేరియంట్ ధర రూ. 11.99 లక్షలుగా ఉందని, మొదటి 25,000 బుకింగ్లకు మాత్రమే ఈ ధరకు విక్రయించనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. ఇటీవల ఇన్పుట్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఆటో పరిశ్రమలో దాదాపు అన్ని కంపెనీలు వాహనాల ధరలను పెంచుతున్నాయి. మహీంద్రా సంస్థ సైతం ధరలను పెంచాలని భావిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.