ఇంకో వారంలో మహీంద్రా ఎక్స్‌యూవీ700 బుకింగ్ ప్రారంభం

by  |
ఇంకో వారంలో మహీంద్రా ఎక్స్‌యూవీ700 బుకింగ్ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన ప్రీమియం ఎస్‌యూవీ మోడల్ ఎక్స్‌యూవీ700 బుకింగ్‌లను అక్టోబర్ 7 నుంచి ప్రారంభిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. అందుబాటు ధరలో అత్యాధునిక ఫీచర్లతో ఈ ఎస్‌యూవీ వాహనం వినియోగదారులకు లభించనుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు కోరుకునే మెరుగైన వేరియంట్లు, సౌకర్యవంతమైన సిటింగ్ సామర్థ్యం, ఆకట్టుకునే డ్రైవింగ్ అనుభూతి, ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌ను ఈ కారు మోడల్‌లో అందిస్తున్నామని కంపెనీ వివరించింది.

మాన్యువల్, ఆటోమెటిక్ ఆప్షన్లతో 5,7 సీట్ల సామర్థ్యం ఇందులో ఉంది. ప్రస్తుతం మహీంద్రా ఎక్స్‌యూవీ పెట్రోల్ ఇంజిన్ బేసి వేరియంట్ ధర రూ. 11.99 లక్షలుగా ఉందని, మొదటి 25,000 బుకింగ్‌లకు మాత్రమే ఈ ధరకు విక్రయించనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. ఇటీవల ఇన్‌పుట్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఆటో పరిశ్రమలో దాదాపు అన్ని కంపెనీలు వాహనాల ధరలను పెంచుతున్నాయి. మహీంద్రా సంస్థ సైతం ధరలను పెంచాలని భావిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Next Story

Most Viewed