మహేశ్ ‘సర్కారు వారి పాట’ అప్డేట్

by  |
mahesh babu
X

దిశ, వెబ్‌‌డెస్క్: కరోనా మహమ్మరి దెబ్బకు దేశంలోని అన్నిరంగాలు స్తంభించిపోయాయి. అలాగే సినీ పరిశ్రమ కూడా కరోనా వైరస్ ధాటికి కుదేలుఅయ్యింది. కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో నిలిచిపోయిన సినిమాలన్నీ ఒక్కోక్కటిగా మళ్లీ పునఃప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’.

అయితే ఈ సినిమా కూడా కరోనా కారణంగా నిలిపివేశారు మేకర్స్. మొదటి షెడ్యూల్ దుబాయ్‌లో పూర్తి చేసుకోగా, రెండవ షెడ్యూల్ మొదలయ్యే సమయానికి కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ ఆపేశారు. ఇప్పుడు లాక్‌డౌన్ ఎత్తివేయడంతో తిరిగి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం. వైజాగ్‌లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో మహేశ్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed