థియేటర్‌లో ‘మహాసముద్రం’.. డేట్ ఫిక్స్

by  |
థియేటర్‌లో ‘మహాసముద్రం’.. డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: శర్వానంద్, సిద్ధార్థ్ మల్టీస్టారర్ మూవీ ‘మహాసముద్రం’. అదితి రావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయల్ హీరోయిన్స్‌గా నటిస్తున్న సినిమాలో వెలకట్టలేని ప్రేమ (మహాసముద్రమంత) ను చూపించబోతున్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. బౌండెడ్ స్క్రిప్ట్‌తో ఇంతకు ముందు ఎవరు టచ్ చేయని కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా ద్వారా ‘ఎగిసిపడే సముద్రపు అలల్లో ఎవరు కొలవలేనంత ప్రేమ’ను పరిచయం చేయబోతున్నారు.

ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రాన్ని ఆగస్టు 19న రిలీజ్ చేయబోతున్నట్లు అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు. మా ప్రేమ కథకు సాక్ష్యంగా ఉండేందుకు మాతో పాటు థియేటర్లలో ఆగస్టు 19 నుంచి ‘మహాసముద్రం’ ప్రయాణాన్ని మొదలుపెట్టమని ప్రేక్షకులను కోరారు. సిద్ధు, శర్వ షిప్ అంచున కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న పోస్టర్ షేర్ చేస్తూ రిలీజ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. కాగా డైరెక్టర్ అజయ్ భూపతి తొలి సినిమా ‘ఆర్ఎక్స్ 100’కు మ్యూజిక్ అందించిన చేతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూరుస్తున్నారు.

Next Story

Most Viewed