నవలఖాకు కళ్లద్దాల తిరస్కరణపై దర్యాప్తు

by  |
నవలఖాకు కళ్లద్దాల తిరస్కరణపై దర్యాప్తు
X

ముంబయి: ఎల్గార్ పరిషద్ కేసు నిందితుడు గౌతం నవలఖాకు ఆయన కుటుంబీకులు పంపిన కళ్లద్దాలను వెనక్కి పంపించిన ఘటనపై మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ దర్యాప్తునకు ఆదేశించారు. తలోజా జైలులో ఉన్న నవలాఖ కళ్లజోడు నవంబర్ 27న చోరీకి గురైందని, అవి లేకుంటే ఆయనకు దాదాపు కంటి చూపు కనిపించదని కుటుంబసభ్యులు తెలిపారు. అందుకే ఈ నెల కొత్త కళ్లద్దాలను పార్శిల్‌లో పంపితే జైలు అధికారులు స్వీకరించకుండా వెనక్కి పంపారని వివరించారు. ఇలాంటివాటిని మానవతాదృష్టితో చూడాలని, భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూసుకోవాలని మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అభిప్రాయపడ్డారు. అందుకే దర్యాప్తునకే ఆదేశించారని వివరించారు. ఈ విషయంపై మానవత్వం అవసరమని బాంబే హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానిస్తూ ఖైదీల అవసరాలపై సున్నితంగా నడుచుకునే జైలు అధికారులకు వర్క్‌షాప్ నిర్వమించాలని సూచించింది.

Next Story

Most Viewed