లాక్‌డౌన్ విధింపుపై ‘మహా’ సీఎం కీలక ప్రకటన..

by  |
లాక్‌డౌన్ విధింపుపై ‘మహా’ సీఎం కీలక ప్రకటన..
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మహా సీఎం ఉద్ధవ్ థాక్రే వైరస్​కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై శనివారం వర్చువల్‌గా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. సీఎం నిర్ణయం మేరకు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. దీంతో, మరో 2 రోజుల పాటు పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలించాలని సీఎం నిర్ణయించారు.

ఈ మేరకు రేపు టాస్క్​ ఫోర్స్ సమావేశం కానుంది. ఆ తర్వాతే లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, థ్రాకే.. నిర్ణయాన్ని మిత్రపక్షాలు కాంగ్రెస్, ఎన్సీపీ సమర్థించాయి. కానీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ మాత్రం లాక్‌డౌన్ అంశాన్ని వ్యతిరేకించారు.


Next Story

Most Viewed