- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: అమెరికాలోని టెక్సాస్లో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామానికి చెందిన నరసింహా రెడ్డి, లక్ష్మీ దంపతుల పిల్లలు మౌనిక, భరత్. ఇద్దరు టెక్సాస్లో ఉద్యోగాలు చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం నరసింహారెడ్డి, లక్ష్మీ టెక్సాస్లోని తమ కొడుకు, కూతురు వద్దకు వెళ్లారు.
తమ బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో నలుగురు పాల్గొన్నారు. అనంతరం కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులతో పాటు కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు. మౌనికకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. నరసింహారెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ 1వ డీపోలో ఆర్టీసీ కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. వీరి మృతితో పెద్దచింతకుంట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.