మహా పాదయాత్రకు సీపీఐ నారాయణ మద్దతు 

by  |
cpi narayana
X

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం మహా పాదయాత్రకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మద్దతు పలికారు. 38వ రోజు పాదయాత్ర బుధవారం చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలం చింతపాలెం నుంచి ప్రారంభమైంది. రాజులపాలెం, పంగూరు మీదుగా పాదయాత్ర కొనసాగుతుండగా నారాయణ యాత్రకు మద్దతు ప్రకటించారు.

గత కొంతకాలంగా కాలు నొప్పితో బాధపడుతున్న నారాయణ బుధవారం మహా పాదయాత్రలో ప్రత్యక్షమయ్యారు. నారాయణ ఆరోగ్యం గురించి అమరావతి రైతులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.


Next Story

Most Viewed