కొవిషీల్డ్ సురక్షితం కాదు.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు

by  |
కొవిషీల్డ్ సురక్షితం కాదు.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు
X

చెన్నై: సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన ‘కొవిషీల్డ్’ టీకా సురక్షితం కాదని ప్రకటించాలని మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు పంపింది. కొవిషీల్డ్ టీకా మూడో దశ ట్రయల్స్‌లో వాలంటీర్‌గా చేరిన చెన్నై వాసి ఈ పిటిషన్ వేశారు. ట్రయల్స్‌లో ఈ టీకా వేసుకున్న తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొన్నానని ఆరోపించారు. క్రియేటివిటీని కోల్పోయారని, మతిస్థిమితాన్నీ కోల్పోయారని తెలిపారు. అందుకే, కొవిషీల్డ్ టీకా సేఫ్ కాదని ప్రకటించాలని, అలాగే, తనకు పరిహారంగా రూ. 5 కోట్లు అందజేయాలని డిమాండ్ చేశారు. గతేడాదిలోనూ ఈయనే కొవిషీల్డ్ టీకాపై సంచలన ఆరోపణలు చేయగా సీరం స్పందించింది. ఆయన చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, తామూ 100 కోట్ల దావా వేయవచ్చునని హెచ్చరించింది.



Next Story

Most Viewed