గగన్‎పహాడ్ వద్ద మాధవ్ మృతదేహం

by  |
గగన్‎పహాడ్ వద్ద మాధవ్ మృతదేహం
X

దిశ, వెబ్‎డెస్క్ : రంగారెడ్డి జిల్లా గగన్‎పహాడ్‎కు చెందిన మాధవ్ మృతదేహం లభ్యమైంది. వరద ప్రవాహంలో లారీల మధ్య మృతదేహం చిక్కుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్‎లోని గగన్‎పహాడ్‎కు చెందిన ఎయిర్‎పోర్టు ఉద్యోగి మాధవ్.. మంగళవారం పంజాగుట్ట దగ్గర తన తల్లిని బస్సు ఎక్కించాడు. బస్సు వెనకాలే గగన్‎పహాడ్‎కు వెళ్లాడు. కాగా, ఆ రోజు నుంచి మాధవ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో మాధవ్ ఫ్రెండ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం ఉదయం గగన్‎పహాడ్‎ దగ్గర మాధవ్ బైకును గుర్తించారు. వరద ప్రవాహంలో లారీల మధ్య చిక్కుకున్న మాధవ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed