అత్యంత పకడ్బందీగా మద్యం టెండర్ల లక్కీ డ్రా - Minister Srinivas Goud

by Disha Web Desk 11 |
అత్యంత పకడ్బందీగా మద్యం టెండర్ల లక్కీ డ్రా - Minister Srinivas Goud
X

దిశ,మహబూబ్ నగర్: సోమవారం నిర్వహించే మద్యం టెండర్ల లక్కీ డ్రా ను అత్యంత పకడ్బందిగా నిర్వహించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ఎక్సైజ్ టెండర్ల లక్కీ డ్రా కు సంబంధించిన ఏర్పాట్లపై మహబూబ్ నగర్ లోని తమ క్యాంప్ కార్యాలయంలో ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యంత పారదర్శకమైన నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకురావడం వల్ల ఎక్కడ కూడా మద్యం దుకాణాల కోసం సిండికేట్లు కాకుండా కఠినమైన చర్యలు తీసుకున్నామని,రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం 1,31,490 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

సోమవారం ఉదయం 11 గంటల నుంచి అన్ని జిల్లా కలెక్టరేట్లలో వీడియో చిత్రీకరణ ద్వారా ఆయా జిల్లా కలెక్టర్ల సమక్షంలో అత్యంత పారదర్శకంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా నిర్వహిస్తామని,గెలుపొందిన వారికి వెంటనే అలాట్మెంట్ ఆర్డర్లు కూడా అక్కడే అధికారులు అందిస్తారని మంత్రి వివరించారు.లైసెన్స్ దారులు,ఎంట్రీ పాస్ ఉన్న వారికి మాత్రమే లక్కీ డ్రా నిర్వహించే ప్రాంతంలోకి అనుమతి ఉంటుందని తెలిపారు.

ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.టెండర్ల ప్రక్రియలో చిన్న పొరపాటు జరిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.సమైక్య రాష్ట్రంలో మద్యం మీద వచ్చే ఆదాయం అక్రమ మద్యం వ్యాపారం చేసే వారి జోబుల్లోకి పోయేదని,నకిలీ మద్యాన్ని నిరోధించినందున ప్రస్తుతం ఆ ఆదాయం అంతా నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతోందని మంత్రి తెలిపారు.అక్రమ మధ్యాన్ని అరికట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తున్న అధికారులకు క్రమం తప్పకుండా పదోన్నతులు కూడా ఇస్తామని తెలిపారు.మహబూబ్ నగర్ ఎక్సైజ్ సూపర్ ఇంటెండెంట్ సైదులు,సీఐ వీరారెడ్డి,ఎస్సై శ్రీనివాస్ ఉన్నారు.


Next Story