- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో భూకంపం
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం మధ్యాహ్నం స్వల్పంగా భూమి కంపించింది. నెలలోపే ఇలా భూమి కంపించడం ఇది మూడోసారి. తాజాగా, సంభవించిన భూకంప కేంద్రాన్ని ఢిల్లీ-యూపీ సరిహద్దు ప్రాంతంలోని 15కిలోమీటర్ల లోతులో గుర్తించినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 1.45గా నమోదైనట్టు వెల్లడించారు. ఈ ప్రకంపనల్లో ఎలాంటి ఆస్థి, ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఢిల్లీలో భూ ప్రకంపనలు వచ్చాయనీ, అందరూ క్షేమంగా […]</p>

X
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం మధ్యాహ్నం స్వల్పంగా భూమి కంపించింది. నెలలోపే ఇలా భూమి కంపించడం ఇది మూడోసారి. తాజాగా, సంభవించిన భూకంప కేంద్రాన్ని ఢిల్లీ-యూపీ సరిహద్దు ప్రాంతంలోని 15కిలోమీటర్ల లోతులో గుర్తించినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 1.45గా నమోదైనట్టు వెల్లడించారు. ఈ ప్రకంపనల్లో ఎలాంటి ఆస్థి, ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఢిల్లీలో భూ ప్రకంపనలు వచ్చాయనీ, అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ 12, 13 తేదీల్లోనూ 3.5, 2.7 తీవ్రతలతో ప్రకంపనలు నమోదైనట్టు తెలిపారు.
Next Story






