ఆదిలాబాద్‌లో‎ ప్రేమజంట ఆత్మహత్య

by  |
ఆదిలాబాద్‌లో‎ ప్రేమజంట ఆత్మహత్య
X

దిశ, ఆదిలాబాద్ : వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కారణమేంటో తెలియదు కానీ ఇద్దరూ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేగామా గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన గోడం శ్రీరామ్, గెడ్డం సుజాత ఒకే తెగకు చెందినవారు. వీరిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే సోమవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు ప్రేమికులు కలిసి ఊరి బయట చెక్ డ్యాం వద్దకు చేరుకున్నారు.

తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగారు. అర్ధరాత్రి శ్రీరామ్ తల్లితండ్రులు ఇంట్లో కొడుకు లేని విషయాన్ని గమనించి స్థానికులతో కలిసి పరిసర ప్రాంతాల్లో వెతికారు. దీంతో చెక్ డ్యాం వద్ద శ్రీరామ్, సుజాత అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో శ్రీరామ్ మృతి చెందాడు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మధ్యాహ్నం సుజాత చనిపోయింది. అయితే వారిద్దరూ ఒకే తెగకు చెందినవారైనా తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరిస్తారో.. లేదోననే భయాందోళనతో వారు ఆత్మహత్య చేసుకొని ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు. మృతుల కుటుంబాల ఫిర్యాదు మేరకు ఎస్ఐ దివ్యభారతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed