- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో : ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసిబతకాలనుకున్నారు. వివాహ బంధంతో తమ ప్రేమను పండించుకోవాలనుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. కులాలు వేరు కావడంతో ప్రేమ వివాహానికి ఒప్పుకునేది లేదని ఇరుకుటుంబాలు తేల్చి చెప్పాయి. దీంతో కలిసి జీవించలేనప్పుడు.. కలిసి చనిపోవడమే మంచిదని భావించిన ఆ ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. ఆత్మకూరు టెక్కేవీధికి చెందిన సోమా నవీన్ (20), ఆయేషా (18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. ఎంత ప్రయత్నించినప్పటికీ పెద్దల మనసులు మారకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నారు. పొలాల్లో విషగుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రేమజంటను గమనించిన స్థానికులు వెంటనే ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.