కత్తులతో కిరాతకంగా నరికి.. గాయాలపై కారం చల్లిన దుండగులు

by  |
Mustaq Patel
X

దిశ, ఎల్బీనగర్: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన హయత్‌నగర్‌లోని రేడియో స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎల్బీనగర్‌లోని సైదాబాద్‌కు చెందిన ముస్తాక్ పటేల్(46) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శనివారం అకస్మాత్తుగా కొందరు గుర్తుతెలియని దుండగులు ముస్తాక్ పటేల్‌ను కత్తులతో కిరాతకంగా హత్యచేసి, గాయాలపై కారంచల్లి, హయత్ నగర్ సమీపంలోని రేడియో స్టేషన్ వద్దనున్న మారుతీ కారులో వెనుక సీట్లో వదిలి వెళ్లారు. స్థానికుల సాయంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుని తండ్రి పీర్‌సాబ్ పటేల్‌కు సమాచారం ఇచ్చారు.

దీంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పీర్‌సాబ్ తన కుమారున్ని కోడలే హత్యచేసిందని అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కోడలుకు గత కొన్నేండ్లుగా మహ్మద్ అమీద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని, వారితో పాటు సయ్యద్ నయీబ్ అనే వ్యక్తితో కలిసి తన కుమారున్ని అంతమొందించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్జోద్ బేగం అక్బర్‌బాగ్‌లో కూరగాయల వ్యాపారం చేస్తోంది.



Next Story