లారీ బీభత్సం…ఇద్దరు మృతి

by  |
road accident
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో లారీ బీభత్సం సృష్ఠించింది. కృష్ణలంక బస్టాండ్ రోడ్డులో బైక్ పై వెళుతున్న ముగ్గురిని లారీ ఢీ కొట్టింది. లారీ ఢీ కొట్టడంతో బైక్ నుంచి మంటలు చెలరేగి ఓ వ్యక్తి అగ్నికి ఆహుతి అయ్యాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మద్యలో ఒకరు మృతి చెందారు. మృతులను రణధీర్ నగర్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed