రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన

by  |
రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. అయితే, గుజరాత్‌లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంలో రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూడు, నాలుగు రోజుల లాక్ డౌన్, కర్ఫ్యూ విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గుజరాత్ హైకోర్టు కోరింది.

వారాంతంలో కర్ఫ్యూ విధించడంపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో హాజరు అయ్యే రాజకీయ సమావేశాలు, ఇతర వేడుకల నిర్వహణను నిలిపేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది.

Next Story

Most Viewed