రేపటి నుంచి యాదగిరిగుట్టలో లాక్‌డౌన్

by  |
రేపటి నుంచి యాదగిరిగుట్టలో లాక్‌డౌన్
X

దిశ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కరోనా విజృంభిస్తున్న వేళ యాదగిరిగుట్ట పట్టణంలోని మున్సిపల్ అధికారులు ఈ నెల 11 నుంచి లాక్‌డౌన్ విధించనున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి తెలిచి, సాయంత్రం 5 గంటల వరకు అన్ని దుకాణాలు బంద్ చేయాలని యాదగిరిగుట్ట కమిషనర్ జంపాల రజిత ప్రకటనలో తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా దుకాణాలు తెరిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అంతేగాకుండా అందరూ మాస్కు, భౌతికదూరం తప్పక పాటించాలని కోరారు.

Next Story

Most Viewed