కరోనా ఎఫెక్ట్: చౌటుప్పల్‌లో లాక్ డౌన్

by  |
కరోనా ఎఫెక్ట్: చౌటుప్పల్‌లో లాక్ డౌన్
X

దిశ, మునుగోడు: కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తుండటంతో ఎక్కడికక్కడ జనాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ను ప్రకటించుకుంటున్నారు. తాజాగా.. శుక్రవారం నుంచి చౌటుప్పల్ పట్టణంలో కూడా లాక్‌డౌన్ విధించనున్నారు. ఈ విషయాన్ని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు తెలిపారు. స్థానిక ప్రజల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. చౌటుప్పల్ పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారని, కరోనాను అరికట్టడానికి లాక్‌డౌన్ విధించాలని స్థానికుల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శుక్రవారం నుంచి వారంరోజుల పాటు లాక్‌డౌన్ అమలవుతుందని కావున వ్యాపార, వాణిజ్య సముదాయాలు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అవసరం ఉంటే తప్పా ప్రజలెవరూ బయటకు రావొద్దని తప్పనిసరిగా మాస్కు ధరించాలని మున్సిపల్ చైర్మన్ సూచించారు.



Next Story

Most Viewed