అక్కడ జూలై 31 వరకు లాక్‌డౌన్

by  |
అక్కడ జూలై 31 వరకు లాక్‌డౌన్
X

దిశ, వెబ్ డెస్క్: ఝార్ఖండ్ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. జూలై 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో సామాజిక, రాజకీయ, క్రీడలు, వినోదం, విద్యా, మతపరమైన, ఇతర కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల రాకపోకలను కూడా నిషేధించారు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రోడ్లపై రాకపోకలను బంద్ చేశారు. సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరిగా పాటించాలని సీఎం సూచించారు.

Next Story