సీఎం కీలక నిర్ణయం.. రేపటి నుండి వీకెండ్ లాక్‌డౌన్

by  |
సీఎం కీలక నిర్ణయం.. రేపటి నుండి వీకెండ్ లాక్‌డౌన్
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌లో కూడా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో రేపు సాయంత్రం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు వీకెండ్ లాక్‌డౌన్ విధిస్తున్నట్టు సీఎం ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా ప్రభావం ఎక్కువగా పట్టణాల్లో కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కరోనా కట్టడికి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.



Next Story