భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో పలు స‌డ‌లింపులు: కలెక్టర్ ఎంవీరెడ్డి

by  |

దిశ‌, ఖ‌మ్మం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో ఆంక్షలపై పలు సడలింపులు ఇస్తున్నట్లు క‌లెక్ట‌ర్ ఎంవీరెడ్డి శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వివరించారు. కిరాణా వస్తువులు, కూరగాయలు, పండ్లు కొనుగోలు చేసేందుకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎప్పుడైనా తీసుకెళ్లేలా వీలు క‌ల్పించిన‌ట్టు స్పష్టంచేశారు. కాగా, ద్విచక్ర వాహనంపై ఒక్కరు, కారులో ఇద్దరు మాత్రమే నిత్యావసరాలు తెచ్చుకొనేందుకు బయటకు రావడానికి అనుమతి ఉందని కలెక్టర్ ఆదేశించారు.

Tags: lockdown free, bhadradri kothagudem dist, collector mv reddy



Next Story

Most Viewed