Lockdown: పుదుచ్చేరిలో లాక్‌డౌన్ పొడగింపు..

by  |
Lockdown: పుదుచ్చేరిలో లాక్‌డౌన్ పొడగింపు..
X

దిశ, వెబ్‌డెస్క్ : పుదుచ్చేరిలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్నర్ డాక్టర్ త‌మిళిసై సౌంద‌రాజ‌న్ నిర్ణయించారు. క‌రోనా కేసులు భారీగా న‌మోద‌వుతుండ‌డంతో లాక్‌డౌన్‌ను ఈ నెల 31వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. నిత్యావ‌స‌ర దుకాణాలు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేస్తాయ‌ని, ఆ త‌రువాత ప్రజ‌లు అన‌వ‌స‌రంగా రోడ్ల మీద‌కు రాకుండా ఇళ్లలోనే సుర‌క్షితంగా ఉండాల‌ని సూచించారు. కరోనా కేసులు తగ్గితే వచ్చే వారం అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు.

Next Story

Most Viewed