నరసరావుపేటలో సంపూర్ణ లాక్‌డౌన్ పొడిగింపు

by  |
నరసరావుపేటలో సంపూర్ణ లాక్‌డౌన్ పొడిగింపు
X

గుంటూరు జిల్లా నరసరావు‌పేటలో మరో మూడు రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ను పొడింగించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ పట్టణంలో పర్యటించి ఈ నిర్ణయం తీసుకున్నారు. స్థానిక వరవకట్ట ప్రాంతంలో కరోనా నియంత్రణకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అయినప్పటికీ కరోనా నియంత్రణలోకి రాకపోతే మరికొన్ని రోజులు సంపూర్ణ లాక్‌డౌన్ కొనసాగిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. స్థానికులు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని సూచించారు.

Tags: coronavirus, narasaraopet, guntur, andhra pradesh, covid-19


Next Story