- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : చిన్నతనం అంటే ఏమి తెలియని తనం అంటారు. కానీ ఒకందుకు ఏమి తెలియని తనమే మంచిది అనిపిస్తోంది కొన్ని సంఘటనలు చూస్తే. నాలుగు రోజుల క్రితం మాతృభూమి సేవలో అమరుడైన సాయితేజ కొడుకును చూస్తే ఎవరికీ కన్నీళ్లు ఆగట్లేవు. తన తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలియక ఆడుకుంటున్న చిన్నారి తీరును చూసి బంధువులు రోదిస్తున్నారు.
తమిళనాడులో జరిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) హెలికాప్టర్ దుర్ఘటనలో తెలుగు జవాన్ సాయితేజ అమరుడయ్యాడు. మాతృభూమి సేవలో అమరుడైన సాయితేజ భౌతికకాయం చిత్తూరు జిల్లాలోని తమ స్వగ్రామం ఎగువ రేగడపల్లెకు తీసుకొచ్చారు. ఎంతో మంది అతన్ని చూడటానికి చిత్తూరు జిల్లాకు వెళ్తున్నారు. అయితే అక్కడ తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలియని సాయితేజ కుమారుడిని చూసి అందరూ కన్నీటి పర్యాతం అవుతున్నారు. తన తండ్రి ఇంకా బతికే ఉన్నాడు దేశం కోసం పోరాడుతున్నాడు అనుకుంటున్నాడేమో ఆ చిన్నారి. ఇంటికి అంత మంది జనం ఎందుకు వస్తున్నారో తెలియక వచ్చే వారిని అమాయకత్వంతో చూస్తుండిపోయాడు. అంతే కాకుండా తన తండ్రి చనిపోయాడని తెలియక ఆడుకుంటున్న సాయితేజ ఐదేళ్ళ కుమారుడు మోక్షజ్ఞని చూసినవారికి కన్నీళ్లు ఆగడం లేదు.