మహిళ స్నానం చేస్తుండగా తొంగిచూసిన వ్యక్తి.. ఆపై చెప్పులతో..!

by  |
మహిళ స్నానం చేస్తుండగా తొంగిచూసిన వ్యక్తి.. ఆపై చెప్పులతో..!
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్‌లో ఓ మహిళ బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో పట్టణానికి చెందిన స్వామి అనే వ్యక్తి బాత్ రూంలోకి తొంగి చూశాడు. దీనిని గమనించిన స్థానికులు స్వామిని పట్టుకొని తీవ్రంగా చితకబాదారు. పోలీస్‌స్టేషన్‌లో అప్పగించేందుకు స్థానికులు ప్రయత్నించగా స్వామి అక్కడి నుంచి పారిపోయాడు.

స్థానికుల కథనం ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన స్వామి అనే వ్యక్తి గాంధీనగర్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా అదే సమయంలో ఓ మహిళ స్నానం చేసేందుకూ బాత్ రూంలోకి వెళ్ళింది. అది గమనించిన స్వామి బాత్ రూంలోకి తొంగి చూసాడు. గమనించిన స్థానికులు స్వామిని పట్టుకొని చెప్పులతో చితకబాదారు. అనంతరం నిందితుడిని పోలీస్‌స్టేషన్‌లో అప్పజెప్పేందుకు స్థానికులు ప్రయత్నంచగా స్వామి అక్కడి నుంచి పారిపోయాడు.

Next Story

Most Viewed