- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : రెండు రోజులపాటు మద్యం అమ్మకాలు బంద్ కానున్నాయి. వైన్స్లు, బార్లను మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. దీంతో మద్యం ప్రియులు రెండు రోజులు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇంతకూ మద్యం దుకాణాలు బందు ఎందుకు చేస్తున్నారు..? ఎక్కడ చేస్తున్నారో తెలుసా..? ఆంధ్ర ప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఈ నెల 18, 19 తేదీల్లో ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవమైన శ్రీపైడి తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలను ఆ రెండు రోజులు మూసివేయాలని కలెక్టర్ సూర్యకుమారి ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. మద్యం దుకాణాలతోపాటు కల్లు దుకాణాలను కూడా తెరవ వద్దని ఆదేశాలు ఇచ్చారు. జాతర సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- Tags
- bar
Next Story