మద్యం కిక్కు.. ఉదయం నుంచే స్టార్ట్..

by  |
మద్యం కిక్కు.. ఉదయం నుంచే స్టార్ట్..
X

దిశ, మహేశ్వరం: మహేశ్వరం మండలంలోని మోహబ్బత్ నగర్, తుమ్మలూరు, అమీర్ పేట్, ఆకాన్ పల్లి, పొరండ్ల, కోళ్ల పడకల్ గ్రామాలతో పాటు, పలు గ్రామాలలో మద్యం అమ్మకాలు ఏరులై పారుతుంది. ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పటి నుంచి గ్రామాలలో పలు కిరాణా దుకాణాలలో, హోటళ్లలో మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. గ్రామాల్లో ప్రధానంగా కిరాణా దుకాణలు, హోటళ్లు నడిపేవారు ఎలాంటి అనుమతి లేకుండా మద్యంను అమ్ముతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒక్క క్వాటర్ బాటిల్ (సీసా) కు 20 – 30 రూపాయలు, బీరు సీసాకు 20 -30 రూపాయల వరకు అదనంగా తీసుకొని విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు.

ఏదైనా పండుగ సందర్బంగా ఉంటే ఒక్క కోటర్ బాటిల్, బీర్ బాటిల్ కు 50-60 రూపాయలు అదనంగా తీసుకొని అమ్ముతున్నారు. మద్యం అమ్మే కిరాణా దుకాణల వైపు, హోటలల్లో వైపు ఎక్సైజ్ శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మద్యం అమ్మకాలు జరుగుతున్న దుకాణాల, హోటళ్ల వైపు ఎక్సైజ్ శాఖ అధికారులు తమకేమి పట్టింపు లేనట్లు వ్యవహరిస్తున్నారని, ఉదయం ఆరు గంటలకే కిరాణా దుకాణలాల్లో, హోటల్లో మద్యం అమ్మకం ప్రారంభం మొదలు పెడుతున్నారని గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. గ్రామాలలో మద్యం అమ్మడం వల్ల మందుబాబులు నిద్ర లేవగానే మద్యం దుకాణాల వైపు మందు బాబుల చూపు మల్తుందంటున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు గ్రామాలల్లో అనుమతి లేకుండా మద్యం అమ్ముతున్న దుకాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed