హైదరాబాద్‌లో భయానకం.. ఇంటిపై పడిన పిడుగు

by  |
హైదరాబాద్‌లో భయానకం.. ఇంటిపై పడిన పిడుగు
X

దిశ, శేరిలింగంపల్లి : హైదరాబాద్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. శనివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ఆల్విన్ కాలనీ డివిజన్ వెంకటేశ్వర నగర్ కాలనీ రోడ్ నెంబర్- 5లో జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఇంటిపై పిడుగు పడింది.

పిడుగు పాటు ధాటికి ఆ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పిడుగు పడిన చోట గోడ పెచ్చులు ఊడిపడ్డాయి. ఇంటి ముందు నిలిపిన కారుపై దాని ప్రభావం పడటంతో స్వల్పంగా దెబ్బతిన్నది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సంఘటనా స్థలాన్ని మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు పరిశీలించారు.


Next Story

Most Viewed