పరగడుపున తినకూడనివి.. స్వీట్ బ్రేక్ ఫాస్ట్ అవాయిడ్ చేయాలని సూచన

by Disha Web Desk 6 |
పరగడుపున తినకూడనివి.. స్వీట్ బ్రేక్ ఫాస్ట్ అవాయిడ్ చేయాలని సూచన
X

దిశ, ఫీచర్స్ : మీ ఉదయపు భోజనం చాలా కీలకమైనది. దాదాపు పది గంటల విరామం తర్వాత తీసుకునే ఈ ఆహారం.. ఫుల్ డే టోన్ సెట్ చేస్తుంది. అలాంటప్పుడు ఖాళీ కడుపుతో ఆహారాన్ని తీసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఇది మీ ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు. ఉదయాన్నే కొందరు భారీ మొత్తంలో ఫుడ్ తీసుకుంటే మరికొందరు తేలికగా ఉండాలని ఇష్టపడతారు. ఇంతకీ ఉదయం ఏం తినాలి? ఏం తినకూడదు? చూద్దాం.

హనీ విత్ లెమన్ వాటర్

చాలా మంది ఉదయాన్నే నిమ్మకాయ నీటిలో తేనె కలిపిన పానీయాన్ని సేవిస్తుంటారు. ఇది ఫ్యాట్ బర్నర్‌గా ఉపయోగపడుతుందని నమ్ముతారు. కానీ అలా చేయొద్దని సలహా ఇస్తున్నారు నిపుణులు. తేనెలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. చక్కెర కంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి సంకలనాలు లేని స్వచ్ఛమైన తేనె దొరకడం కష్టం. చాలా మంది తేనె పేరుతో చక్కెర, రైస్ సిరప్‌ను తీసుకుంటారు. దీని కారణంగా రోజంతా ఎక్కువ ఆహారం తీసుకునే కోరికలకు దారితీస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అయితే రా హనీ ఆరోగ్యకరమైన సహజ స్వీటెనర్లలో ఒకటి. పోషకాలు, రోగనిరోధక వ్యవస్థను పెంచే సమ్మేళనాలతో సమృద్ధిగా ఉండే ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్ల గొప్ప మూలంగా ఉంటుంది. ఇలాంటి తేనె వాస్తవానికి జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

టీ అండ్ కాఫీ

ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్లాలు ఏర్పడతాయని.. ఇది పొట్టను కలవరపెడుతూ, జీర్ణ సమస్యలను సృష్టిస్తుందని చెప్తున్నారు నిపుణులు.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ, కాఫీ, ఇతర రకాల కెఫిన్‌లు ఖచ్చితంగా తీసుకోకూడదు. ఎందుకంటే నిద్రలేవగానే కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయిలు అప్పటికే ఎక్కువగా ఉంటాయి. కెఫిన్‌ తీసుకుంటే మరింత పెరుగుతుంది. అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. అందుకే నిద్ర లేచిన తర్వాత టీ తాగేందుకు కనీసం ఒక గంట లేదా రెండు గంటలు వేచి ఉండాలని సూచిస్తున్నారు. కొంచెం ఆహారం తీసుకున్నాకే టీ, కాఫీలు తాగాలని చెప్తున్నారు.

స్వీట్ బ్రేక్‌ఫాస్ట్

రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి స్వీట్ బ్రేక్‌ఫాస్ట్ కంటే రుచికరమైన అల్పాహారాన్ని తీసుకోవాలని సలహా ఇస్తున్నారు నిపుణులు. తమ ఫిట్‌నెస్‌పై ట్యాబ్‌లను ఉంచాలనుకునే వారికి ఇది సరైనది. ప్రోటీన్లు, కొవ్వు కలిగిన ఉదయం భోజనం రోజంతా ఆకలిని తగ్గిస్తుంది. భోజన సమయంలో ఆకలి ఉండదు. తీపి అల్పాహారం బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని పెంచుతుంది. త్వరగా క్రాష్ చేస్తుంది. పిండి పదార్థాలు, శక్తిని పొందేందుకు ఆరాటపడుతుంది.

పండ్లు

ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే పండ్లు చాలా త్వరగా జీర్ణమవుతాయి. గంటలోనే మళ్లీ ఆకలిని కలిగిస్తాయి. ఖాళీ కడుపుతో తిన్న కొన్ని సిట్రస్ ఫ్రూట్స్ ఎసిడిటీకి దారితీస్తాయి. ఇలా కాకుండా నట్స్, అవకాడో, నెయ్యి, సీడ్స్ వంటి కొవ్వు, ప్రోటీన్లు అధికంగా ఉండే అల్పాహారంతో రోజును ప్రారంభించాలని సలహా ఇస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంతోపాటు రోజంతా ఆహార కోరికలను తగ్గిస్తాయి.

ఉదయాన్నే ప్రోటీన్, కొవ్వు అధికంగా ఉండే భోజనం బ్లడ్ షుగర్‌ను స్థిరీకరించడంలో సహాయపడుతుందనేది నిజమే. మధుమేహం లేని, జీవక్రియ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు, ఇన్సులిన్ నిరోధకత లేని వారు ఖచ్చితంగా తేనె, పండ్లు వంటి కొన్ని ఆరోగ్యకరమైన పిండి పదార్థాలను అల్పాహారంగా తినాలనుకుంటే ఆస్వాదించవచ్చు. వ్యక్తిగత ప్రాధాన్యతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మనం మన ఆహారాన్ని ఆస్వాదించడానికి, శరీరానికి తగినట్లుగా ఉండటానికి ప్రయత్నించాలి. కార్టిసాల్, ఒత్తిడి సమస్యలతో ఉన్న కొందరు వ్యక్తులు ఉదయాన్నే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే కొన్ని ఆరోగ్యకరమైన పిండి పదార్థాల నుండి ప్రయోజనం పొందవచ్చు.

Also Read...

మామిడి పండు తింటున్నట్లు కల వస్తే మంచిదేనా?

ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు భ్రమ.. అరుదైన సైకియాట్రిక్ డిజార్డర్స్..



Next Story

Most Viewed